ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు 

Jun 10, 2025 - 20:11
 0  6

గ్రామాన్ని సందర్శించడానికి అవకాశం ఇవ్వకపోతే చలో పెద్ద ధన్వాడ కార్యక్రమానికి పిలుపునిస్తాం.

రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు.

జోగులాంబ గద్వాల 10 జూన్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రాణాంతక ఇథనాల్ పరిశ్రమను  రద్దు చేయాలని అన్ని రాజకీయ పార్టీలు సామాజిక ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.మంగళవారం జిల్లా కేంద్రంలోని స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీలు సామాజిక ప్రజా సంఘాలు పరిశ్రమ ప్రభావిత గ్రామాల రైతులు పాల్గొన్నారు. 
ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి మాట్లాడుతూ పర్యావరణానికి ప్రజల ప్రాణాలకు సాగు భూములకు మూగ జీవాలకు తీవ్ర హాని చేసే ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు .మొదటి నుంచి ప్రభుత్వం పోలీసులు ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు గురించి ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని  అన్నారు పరిశ్రమ ఏర్పాటును అది నుండి ముక్త కంఠంతో రైతులు  వ్యతిరేకించారని జిల్లా అధికార యంత్రాంగం సమక్షంలో యిదే విషయాన్ని రైతులు అనేక సందర్భాల్లో స్పష్టం చేశారని అన్నారు. రైతుల ప్రాణాలతో  భవిష్యత్ తరాల జీవితాలను   అంధకారంలో నెట్టే ప్రయత్నం చేయవద్దని అధికారులు పోలీసులను రైతులను వేడుకున్నారని ఐన పాలకులకు అధికార యంత్రాంగానికి కనికరం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు  నదులను సాగు భూములను నాశనం చేసే పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం ఎందుకు ముందుకు వెళుతున్నారో అర్థం కావడం లేదన్నారు జైలుకు వెళ్లిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు రాజకీయ పార్టీలను ప్రజా సంఘాల నాయకులను గ్రామానికి కూడా వెళ్ళనివ్వకపోవడం దుర్మార్గమని అన్నారు. 
గ్రామాన్ని సందర్శించేందుకు అనుమతించకపోతే అఖిలపక్ష పార్టీలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చలో పెద్ద ధన్వాడ కార్యక్రమానికి పిలుపునిస్తామని అన్నారు.
 ఈ సందర్భంగా పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ ఇక్బాల్ పాషా మాట్లాడుతూ రైతులు ప్రజలు  పనులన్నీ వదులుకొని తమ పిల్లల కోసం ఈ పోరాటంలో పాల్గొంటున్నారని తెలిపారు రైతులు పరిశ్రమ ఏర్పాటు వల్ల వచ్చే నష్టాలను మిగతా ప్రాంతాలలో కూడా అధ్యయనం చేసిన తర్వాతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని  అన్నారు గ్రామలలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని రైతులు ప్రాణాలను గుప్పెటలో పెట్టుకొని బ్రతుకుతున్నారని అన్నారు మొదటి నుంచి పరిశ్రమ యాజమాన్యం రెచ్చగొట్టే  మాటలు మాట్లాడుతున్న  రైతులు శాంతియుతంగా ఉద్యమాన్ని నడిపారని అన్నారు సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ రైతులపై ప్రైవేటు బౌన్సార్లతో దాడులు చేయించి వారినే జైలులో పెట్టిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు.చివరికి రైతుల కుటుంబాలను పరామర్శించడానికి వెళుతున్న రాజకీయ పార్టీలు సామాజిక ప్రజా సంఘాల నాయకులను నిర్బందం లోకి తీసుకోవడాన్ని చూస్తుంటే ఇది ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ గుర్తుకు తెస్తున్నదని అన్నారు రైతులను పోలీసులు ఉగ్రవాదులలాగా చూస్తున్నారని అన్నారు.
బాధిత రైతులు మాట్లాడుతూ అనేక నెలలుగా ప్రభుత్వానికి మొరపెట్టుకున్న పట్టించుకోలేదని కంపెనీ యాజమాన్యమే మాపై దాడులకు పాల్పడిందని దళిత మహిళ మరియమ్మ పై కంపెనీ వారు దాడి చేశారని తెలిపారు. సంఘటన జరిగిన తర్వాత గ్రామంలో స్వేచ్ఛగా ఉండలేకపోతున్నామని
పోలీసులు మఫ్టిలో వచ్చి వీధులలలో తిరుగుతుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు ఆవాజ్ జిల్లా అధ్యక్షులు రహమతుల్ల మాట్లాడుతూ తాము రైతు ప్రభుత్వం అని చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీ,స్థానిక నాయకులు సంపత్ కుమార్ చెరసాలలో ఉన్న రైతుల కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు రైతులకు కార్పొరేట్ శక్తులకు మధ్య జరుగుతున్న పోరాటాన్ని బీసీ సంక్షేమ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య కులాల మధ్య కొట్లాటగా మారుస్తున్నారని అన్నారు ఇది కులాల మధ్య పోరాటం కాదని కార్పోరేట్ శక్తులకు రైతులకు మధ్య జరుగుతున్న సంఘర్షణ అని అన్నారు క్రిష్ణయ్య   ఉద్యమాలు చేసిది బడుగుల కోసమ లేకపోతే తన బందువులకు లబ్ధి చేకూర్చడం కోసమా అని ప్రశ్నించారు బీసీ ల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టే ఆర్ కృష్ణయ్య కు బీసీలు  ఐక్యంగా ఉండి బుద్ధి చెప్పాలని పిలుపు ఇచ్చారు బహుజన రాజ్య సమితి నాయకులు వినోద్ మాట్లాడుతూ తప్పులు చేసి రైతులు జైలుకు వెళ్లలేదని భూమి కోసం పోరాడిన వీర యోధులు రైతులు అని కొనియాడారు వారికి అండగా అన్ని రాజకీయ పార్టీలు సామాజిక ప్రజా సంఘాలు అండగా ఉంటామని హామీ ఇచ్చారు BRS నాయకులు టవర్ మబ్బుల్ మాట్లాడుతూ మన ప్రాంతం శ్రేయస్సే మనకు ముఖ్యమని మనవాడైన పరాయి వాడైన రైతులు ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చే ఏ వ్యక్తిని శక్తిని క్షమించబోరాదని అన్నారు.
బాధిత గ్రామాల రైతులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా పోలీసులు వ్యవహరించడం మానుకోవాలని, గ్రామాలలో స్వేచ్ఛాయుత వాతావరణ నెలకొల్పాలని, అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. 
పరిశ్రమ నిర్మాణాన్ని చేపట్టకుండా 12 గ్రామాల ప్రజలు కలిసి ఐక్యంగా పోరాటం చేయడం అభినందనీయమని, పోలీసుల తీరుతో ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ధైర్యంగా ఉండి పోరాడాలని కంపెనీ నిర్మాణానికి ఇచ్చిన అనుమతులు రద్దు చేసే వరకు మీ పోరాటానికి అఖిలపక్షం ప్రజా సంఘాలు మద్దతుగా ఉంటాయని భరోసా ఇచ్చారు. 
  ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వివి నరసింహ, ఉప్పేరు నరసింహ, తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కోశాధికారి శంకర ప్రభాకర్, ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతీక్ ఉర్ రహమాన్, పౌర హక్కుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సుభాన్, హమాలి సంఘం అధ్యక్షులు రంగన్న భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు పాంటన్న బాధిత గ్రామాల రైతులు అలెగ్జాండర్, వీరన్న గౌడ్, శ్యాం ప్రసాద్, చిన్న రంగన్న, సామేలు, మోషన్న, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333