కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

Aug 3, 2024 - 15:27
 0  1
కాంగ్రెస్  పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి.కారింగుల వెంకన్న సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు* కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సిపిఐ( ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మకూర్ (S) MRO ఆఫీస్ ముందు ధర్నా చేసి MRO గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ఎలక్షన్ల ముందు ప్రభుత్వం వస్తే ప్రజలకు 6 గ్యారంటీలను ఇస్తామని హామీ ఇచ్చింది ప్రభుత్వం వచ్చి 7 నెలలు కావస్తున్న అందులో కొన్ని హామీలను నెరవేర్చి ఈరోజు వరకు ముఖ్యమైన హామీలు కొన్ని నెరవేర్చకుండా అలాగే కాలయాపన చేస్తుంది కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి పేదవాడికి 126 గజాల ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయల కేటాయించాలని అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఒంటరి మహిళలకు 2500 ఇవ్వాలని వీలైనంత త్వరలో రేషన్ కార్డులు మంజూరు చేయాలని గత బి. ఆర్.ఎస్ ప్రభుత్వంలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను వెలికి తీసి అర్హులైన పేదలకు పంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ సూర్యాపేట డివిజన్ నాయకులు ఎస్కే సయ్యద్, పిడమర్తి లింగన్న, చిత్తలూరు లింగన్న, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది.