కష్టాలు..కన్నీళ్లు.. మానవులకే
అడ్డగూడూరు 23 ఫిబ్రవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– ప్రపంచంలోని ప్రతి మానవునికి కష్టాలు వచ్చినపుడు కన్నీళ్లు వస్తాయి భాధలు ఉన్నపుడు బంధాలు గుర్తుకొస్తాయి పుట్టినప్పుడి నుండి తోడుగా వున్నవారు చిన్నప్పడి నుండి కలిసి తిరిగినోళ్లు,మధ్యలొ జత అయినవారు మనవారె అయినా,చిన్ననాటి కష్టాలు బ్రతుకు దెరువుకొరకు పడిన భాధలు అందరికి గుర్తుంటాయి మర్వలేని జ్ఞాపకాలై మిగులుతాయి అప్పుడప్పుడు మననం చేసుకొవాలి,మనవారెవరొ , పరాయివారు ఎవరొ తెలుస్తుంది.బంధుత్వం బంధం బయట పడుతుంది.అప్పుడే సమాజం కొంతవరకైన అర్ధమౌతుంది.డబ్బును చూసి మురిసిపోవచ్చు బంధాలను వదులుకోవచ్చు వారి భాధలు తీరుండవచ్చు కష్టాలను మరిచిపోవచ్చు కొందరు కాని,కష్టాలలొ వున్నవారు క్రుంగిపోకుండ కన్నీటితొ కడిగి వేయాలి,కనపడని భావోద్వేగాలతొ ఉపశమనం పొందాలి ఆత్మస్థైర్యముతొ నిలదొక్కుకోవాలి దైర్యముతొ ముందుకు పోవాలిఉన్నన్నిన్నాళ్లు తృప్తిగా జీవించాలి?రచన..కడెం.ధనంజయ నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం చిత్తలూర్ గ్రామం..