ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించిన మత్స్యశాఖ జిల్లా అధికారి సుకీర్తి
అడ్డగూడూరు 24 జూలై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయాన్ని ప్రత్యేక అధికారి జిల్లా మత్స్య శాఖ అధికారి సుకీర్తి మండల కార్యాలయాన్ని సందర్శించి,పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.విబిజి రాంజీ,స్వచ్ఛ భారత్ మిషన్,ఇందిరమ్మ ఇండ్లు,ఇతర పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి పనులమీద పురోగతిని సమీక్షించారు.జలసిరి పోస్టర్లను విడుదల చేశారు.ఇట్టి కార్యక్రమంలో ఎంపీడీవో,ఎంపీఓ,సూపర్డెంట్,ఏపీవో పంచాయతీ కార్యదర్శులు,విబిజీ రాంజీ సిబ్బంది పాల్గొన్నారు.