అలంపూరు జోగులాంబ ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

Oct 4, 2024 - 17:05
 0  9
అలంపూరు జోగులాంబ ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

జోగులాంబ గద్వాల 4 అక్టోబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- అలంపూరు జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రసిద్ధ శక్తిపీఠం అలంపూరు జోగులాంబ ఆలయ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నేడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ హాజరయ్యారు. కొత్తగా ఎన్నికైన ఆలయ కమిటీ సభ్యులు తమ బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా కొంకల నాగేశ్వర్ రెడ్డి జోగులాంబ ఆలయ చైర్మన్ గా ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపిన సంపత్ కుమార్, ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333