Pow రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని జనరల్ బాడీ సమావేశం

Aug 22, 2024 - 19:29
Aug 22, 2024 - 21:34
 0  2
Pow రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని జనరల్ బాడీ సమావేశం

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ తుమ్మలపెన్ పహాడ్:-  Pow రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని జనరల్ బాడీ నిర్వహించడం  ఆగస్టు 31 సెప్టెంబర్ 1,2 తేదీలలో హైదరాబాదులో జరుగు ప్రగతిశీల మహిళా సంఘం ( పి ఓ డబ్ల్యు ) తెలంగాణ రాష్ట్ర ఏడవ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం ఆత్మకూర్ ఎస్ మండల పరిధిలోనితుమ్మల పెంపహాడలో నైట్ అలుగుబెల్లి వాణిశ్రీ అధ్యక్షతన జనరల్ బాడీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పి ఓ డబ్ల్యు జిల్లా కార్యదర్శి కంచర్ల నర్సక్క మాట్లాడుతూ పురుషాధిపత్యానికి వ్యతిరేకంగా సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక రంగాలలో సి పురుష సమానత్వం కోసం శ్రామిక వర్గ మహిళల విముక్తి కోసం పి ఓ డబ్ల్యు పనిచేస్తుందని అన్నారు మహిళలు అర్ధరాత్రి సురక్షితంగా ఇంటికి చేరినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లని చెప్పిన మాటలు దశాబ్దాలు గడిచిన దేశంలో రాష్ట్రంలో మహిళలు బాలికలపై లైంగిక హింస అత్యాచారాలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు అనేక సమస్యలతో బాధపడుతున్న మహిళలు శ్రీ పురుష సమానత్వం కోసం పోరాడుతూనే సమ సమాజ స్థాపన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు హైదరాబాదులో పిఓడబ్ల్యూ రాష్ట్ర మహాసభ సందర్భంగా ఆగస్టు 31 జరుగు భారీ ప్రదర్శన బహిరంగ సభకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పోతురాజు ధనమ్మ అల్లి సోమమ్మ లక్ష్మి వరికుప్పల నాగమ్మ కొరివి మంగమ్మ ఆడేపు జానమ్మ తదితరులు సంఘం వెంకటమ్మ కలం చర్ల గంగమ్మ తదితరులు పాల్గొన్నారు