6సెల్ ఫోన్లు రికవరీ.. యజమానులకు అప్పగింత.

ఎస్సై నందికర్ఫోన్లను  యజమానులకు అప్పగించిన ఎస్సై.

Jan 17, 2025 - 19:37
Jan 17, 2025 - 20:31
 0  18
6సెల్ ఫోన్లు రికవరీ.. యజమానులకు అప్పగింత.

జోగులాంబ గద్వాల 18 జనవరి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- మల్దకల్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో గత డిసెంబర్ నెలలో పోగొట్టుకున్న 6 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధిత యజమానులకు అప్పగించినట్లు స్థానిక మండల ఎస్ఐ నందికర్ శుక్రవారం తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం...మండల పరిధిలో సెల్ ఫోన్స్ పోగొట్టుకున్న వారి ఫోన్స్ సి ఈ ఐ ఆర్ అప్లికేషన్ ద్వారా 6 ఫోనులను ట్రేస్ చేసి ఫోన్స్ ను ఆ యజమానులను  స్టేషన్కు పిలిపించి యాజమానులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఎవరైనా తమ సెల్‌ఫోన్‌ పోగొట్టుకున్నా.. చోరీకి గురైనా సీఈఐఆర్‌ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను పొందుపరుచాలని సూచించారు

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State