షీ టీమ్స్ ,సైబర్ నేరాల పై అవగాహన పాలకీడు పోలీస్ స్టేషన్
ఎస్పీ కె నరసింహ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు పాలకీడు SI కోటేష్ గారు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో షీటీమ్స్,సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపైన, పోలీసు కళాభృందంతో విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది
ASI డానియల్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కే నరసింహ ఐపిఎస్ గారి అధ్వర్యంలో డ్రగ్స్,సైబర్ నేరాలపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి స్కూల్ కాలేజీలలో చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా, ATM కార్డ్ వివరాలు, OTP వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే వేధింపులపై 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు. ఎవరైనా ఆకతాయిలు ఆడపిల్లలను, మహిళలను వేధింపులకు గురి చేస్తే సూర్యాపేట షీ టీం ఫోన్ నెంబర్ 8712686056 కి సమాచారం ఇవ్వండి మీయొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని తెలిపారు వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను DP లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు. ఎవరైనా పాఠశాల పరిసర ప్రాంతాలలో గంజాయి విక్రయించిన సేకరించిన రవాణా చేసిన సరఫరా చేసిన పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని చెప్పారు. యువత లోన్ యాప్ లకు దూరంగా ఉండాలన్నారు. పుట్టిన తేదీలను,ఫోన్ నెంబర్లను పాస్వర్డ్ గా పెట్టుకోవద్దు అని సూచించారు. సామాజిక మాధ్యమాలకు రక్షణగా బలమైన పాస్వర్డ్లు పెట్టుకోవాలని అన్నారు అనంతరం పోలీసు కళాబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో విద్యార్థినిలకు అవగాహనా కల్పించారు.ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ పాఠశాల SO సుజాత, కళాబృందం ఇంచార్జి యల్లయ్య,సభ్యులు గోపయ్య, చారి, నాగార్జున , గురులింగం , ఉపాధ్యాయినీలు విద్యార్థినిలు పాల్గొన్నారు.*