విస్తృతంగా తనిఖీలు చేస్తున్న సీఐ రఘువీర్ రెడ్డి

Jun 10, 2024 - 20:41
 0  260
విస్తృతంగా తనిఖీలు చేస్తున్న సీఐ రఘువీర్ రెడ్డి

తిరుమలగిరి 10 జూన్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

 త్వరలో జరగబోయే బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు.నాలుగు జిల్లాలకు సరిహద్దు కూడలి అయిన తిరుమలగిరి తెలంగాణ చౌరస్తా వద్ద ఇతర ప్రాంతాల నుండి హైదరాబాద్ తరలి వెళ్తున్న వాహనాలతో పాటు ఏలాంటి అనుమతి లేకుండా గోవులను తరలించే వాహనాలను తనిఖీ చేసి రశీదులను పరిశీలించారు.బక్రీద్ నేపథ్యంలో హైదరాబాదులో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా జిల్లా ఎస్పీ ఆదేశానుసారం తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి తమ సిబ్బందితో వాహనాలను తనిఖీ చేస్తున్నామని తెలిపారు.ఎవరైనా అక్రమంగా గోవులతో పాటు ఇతర మారక ద్రవ్యాల సామాగ్రిని తరలిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు. వీరి వెంట ఏ ఎస్ఐ రామకోటి కానిస్టేబుల్స్ పాల్గొన్నారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034