విశాఖ కోర్టుకు మంత్రి లోకేష్

Oct 18, 2024 - 18:59
 0  1
విశాఖ కోర్టుకు మంత్రి లోకేష్

విశాఖపట్నం: తనపై సాక్షి పత్రిక రాసిన తప్పుడు కథనానికి సంబంధించి రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖ జిల్లా కోర్టుకు హాజరయ్యారు. 12వ అదనపు జిల్లా కోర్టు వాయిదాకు లోకేష్ హాజరయ్యారు. సాక్షి పత్రిక తప్పుడు కథనాలపై నారా లోకేష్ న్యాయ పోరాటం చేస్తున్నారు. 2019 అక్టోబర్ 22 న   ‘చినబాబు చిరుతిండి రూ. 25 లక్షలండి’ పేరుతో సాక్షిలో అసత్య కథనాన్ని ప్రచురించారు. అవాస్తవ కథనాలు ప్రచురించిన సాక్షిపై  మంత్రి లోకేష్ రూ. 75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఉద్దేశపూర్వకంగా తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడంపై ఈ కేసు దాఖలు చేశారు. ఆగస్టు 29న తొలిసారి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. ఈరోజు మరోసారి క్రాస్ ఎగ్జామినేషన్ కు మంత్రి హాజరయ్యారు. 

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333