రాయల్ డిజిటల్ ఎక్స్రే సెంటర్ ఘనంగా ప్రారంభం
సూర్యాపేట, 25 జూలై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన రాయల్ డిజిటల్ ఎక్స్రే సెంటర్ ను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన, వేగవంతమైన సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు ఈ అవకాశాన్ని సూర్యాపేట పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, రావు స్థానిక కౌన్సిలర్ గుణగంటి హేమ సతీష్, నిర్వాహకులు కడియం సుధాకర్, గణేష్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.