మానవ అక్రమ రవాణా నిర్మూలన మనందరి బాధ్యత. 

Oct 18, 2024 - 18:37
 0  3
మానవ అక్రమ రవాణా నిర్మూలన మనందరి బాధ్యత. 

జోగులాంబ గద్వాల 18 అక్టోబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- మానవపాడు మానవ అక్రమ రవాణా నిర్మూలన మనందరి బాధ్యత అని రాజ్ కుమార్ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు బి రత్నకుమారి అన్నారు. శుక్రవారం ఫౌండేషన్ కార్యాలయంలో మానవ అక్రమ రవాణా బానిసత్వం నిర్మూలన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా లేని సమాజాన్ని స్థాపించాలన్నారు. బానిసత్వాన్ని అంతం చేసినప్పుడే ప్రజలందరూ స్వేచ్ఛగా జీవిస్తారని తెలిపారు. అక్టోబర్ 19న దేశవ్యాప్తంగా మానవ అక్రమ రవాణా నిర్మూలన ర్యాలీలో భాగంగా మానవపాడు మండలం జల్లాపురం గ్రామంలో నిశ్శబ్ద నడక ర్యాలీ జరుగుతుందని తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333