భక్తులకు అందుబాటులో శ్రీ వ్యాసరాయ కళ్యాణ మండపం
జోగులాంబ గద్వాల 7 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ప్రముఖ పుణ్యక్షేత్రం, నడిగడ్డ భక్తుల ఇలవేల్పు బీచుపల్లి శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ సమీపంలో నిర్మించిన కళ్యాణ మండపానికి మరమ్మత్తులు నిర్వహించి శ్రీ వ్యాసరాయ కళ్యాణ మండపముగా తీర్చిదిద్దినట్లు ఈవో పురందర కుమార్ తెలిపారు. ఈనెల 15 నుండి భక్తులకు అందుబాటులో ఉంచి నూతన వివాహాలు జరుపుకోవడానికి కళ్యాణ మండపం అందజేస్తామని ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. అలాగే విజయ రాయ కళ్యాణమండపం కూడా భక్తులకు అందుబాటులో ఉందని ఈవో తెలిపారు.