బధిరుల పాఠశాల లో అన్నదానం
సూర్యాపేట ఫిబ్రవరి 22 :- సూర్యాపేట మండలం లొని కాసరబాద్ రెవిన్యూ శివారులో ఉన్న అపూర్వ బాధిరుల పాఠశాల లో సూర్యాపేట పట్టణానికి చెందిన చల్లా వెంకటేశ్వర్ రావు 15 వ వర్ధంతి సందర్బంగా విద్యార్థులకు వారి కుమారులు చల్లా నాగేంద్ర బాబు, నరేందర్ లు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా పలువురు మాట్లాడుతూ పితృదేవతల పేరున అన్నదానం నిర్వహిస్తే అందరికి మంచి జరుగుతుందని అన్నారు. మనం సంపాదించిన దాంట్లో కొంత అనాదలకు, వృద్దులకు అబాగ్యులకు ఖర్చు చేసి ఆదుకోవాలని అప్పుడే భగవంతుని ఆశీస్సులు లభిస్తాయి
అన్నారు . ఈ కార్యక్రమం లో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జిల్లా అధ్యక్షులు రంగు ముత్యం రాజు , పి ఆర్ ఓ సుంకాని శ్రీనివాస్, ప్రముఖ న్యాయవాది రాచకొండ యాదగిరి, కొండూరి నితిన్, తండ కృష్ణ, రత్నమాల, పాఠశాల నిర్వాహకులు డి .సరిత తదితరులు పాల్గొన్నారు.