దళిత జర్నలిస్ట్ చైతన్య సదస్సు కరపత్రాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కూనంనేని
ప్రతి దళిత జర్నలిస్ట్ హాజరై చైతన్య సదస్సు ను జయప్రదం చేద్దాం
కొత్తగూడెం సెప్టెంబర్ 22 ( ) దళిత జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఈనెల 27న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే దళిత జర్నలిస్టుల ఫోరం చైతన్య సభను ప్రతి దళిత జర్నలిస్టు హాజరై విజయవంతం చేయాలని, దళిత జర్నలిస్ట్ ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు రత్న కుమార్ తెలిపారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి చేతుల మీదుగా, దళిత జర్నలిస్ట్ ఫోరం చైతన్య సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు రత్నకుమార్ మాట్లాడుతూ దళిత జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మొదటి ప్రధాన కల్పించాలని, అక్రిడేషన్ కమిటీలో స్థానం కల్పించాలని, దళిత సీనియర్ జర్నలిస్టులకు నామినేట్ పోస్టులు కల్పించాలని వివిధ అంశాలపై సభ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టిపిసిసి నెంబర్ రాష్ట్ర నాయకులు నాగ సీతారాములు సిపిఐ జిల్లా కార్యదర్శి షాబిర్ పాషా మాజీ మండల ఎంపీపీ శాంతి దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు రత్నకుమార్ జిల్లా అధ్యక్షులు బాలకృష్ణ చుంచుపల్లి మండల అధ్యక్షులు శేఖర్ జర్నలిస్టులు జంపన్న నరసింహ శ్రీను తదితరులు పాల్గొన్నారు.