జిల్లా కలెక్టర్ ఆదేశాలతో దిగివచ్చిన అధికార యంత్రాంగం
తిరుమలగిరి 05 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి సందర్భంగా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధుడు నాయిని హనుమంతు తనకు ఉన్నటువంటి భూమికి బాట కావాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ కు విన్నవించడంతో నేనున్నాను అంటూ వృద్ధునికి భరోసా కల్పించారు. అయితే మంగళవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామానికి చెందిన నాయిని హనుమంతు ఆర్జీ పై తాటిపాముల రెవెన్యూ శివారు సర్వే నెంబర్ 346లో వారి వ్యవసాయ భూమి వరకు బాట గురించి చేసుకున్న దరఖాస్తుపై విచారణ నిమిత్తం, తహశీల్దార్, మండల గిర్ధవార్, మండల డిప్యూటీ సర్వేయర్ మరియు గ్రామ పాలన అధికారి హాజరై సర్వే నిర్వహించడమైనది.