జాజిరెడ్డిగూడెం: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
జాజిరెడ్డిగూడెం మండలం గోపాలపురం స్టేజి వద్ద ఆదివారం తెల్లవారుజామున కారు, లారీ ఢీకొన్న ఘటనలో యువకుడు మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మధు(22) కారులో సూర్యాపేట నుంచి కొమ్మాలకి వస్తుండగా జనగామ నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది