గ్రూప్-1 లో ఆరో ర్యాంకు సాధించిన పునాటి హర్షవర్ధన్ ను సన్మానించి అభినందించిన
మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

తెలంగాణ వార్త మిర్యాలగూడ ఏప్రిల్ 3 : ప్రతిష్టాత్మక గ్రూప్-1 ఫలితాలలో భాగంగా ఇటీవల TGPSC విడుదల చేసిన జనరల్ ర్యాంకింగ్ లిస్టులో మిర్యాలగూడ పట్టణము చైతన్య నగర్ కు చెందినపునాటి తిరుపతి రావు,రాజ్యలక్ష్మి కుమారుడైన పునాటి హర్షవర్ధన్ 6 వ ర్యాంకు సాధించారుఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు వారి ఇంటికి వెళ్ళి హర్షవర్ధన్ కు అభినందనలు తెలిపి శాలువతో ఘనంగా సన్మానించారు
ఈ కార్యక్రమములో దుర్గంపూడి నారాయణ రెడ్డి,ధనావత్ బాలాజీ నాయక్, పద్మశెట్టి కోటేశ్వర రావు,1 వ వార్డు BRS ఇంచార్జ్ పునాటి లక్ష్మీనారాయణ, కొత్త మర్రెడ్డి,కుర్ర పకీర నాయక్ తదితరులు పాల్గొన్నారు.