కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: డీకే
Sep 25, 2024,కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని డీకే అరుణ అన్నారు. గ్రామాల వారీగా సభ్యత్వాల సంఖ్యను భారీ ఎత్తున పెంచాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం దేవరకద్ర నియోజకవర్గం కేంద్రంలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటాలంటే సభ్యత్వాలు భారీ ఎత్తున ఉండాలన్నారు.