ఏసీబీ వలలో చిక్కిన ఎస్సై కానిస్టేబుల్

Jan 28, 2025 - 21:43
 0  1011
ఏసీబీ వలలో చిక్కిన ఎస్సై కానిస్టేబుల్

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పై ఏసీబీ రైడ్

రేషన్ బియ్యం కేసు తప్పించడానికి మూడు లక్షల రూపాయలు డిమాండ్

 ఏసీబీకి పట్టుబడ్డ ఎస్ఐ, కానిస్టేబులు

తిరుమలగిరి 28 జనవరి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ మేరకు ఎస్సై సురేష్, కానిస్టేబుల్ నాగరాజులు పీడీఎస్ బియ్యం కేసులో బాధితులను తొలగించడానికి మూడు లక్ష రూపాయలు డిమాండ్ చేసి లంచం తీసుకుంటుండగా ఏసీబీ దాడులు చేసి పట్టుకున్నారు. సిద్దిపేట జిల్లా వడ్డేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో దాడులు చేయగా పట్టుబడ్డారు. డిమాండ్ చేసిన మూడు లక్షల రూపాయలలో గతంలో ఫోన్ పే ద్వారా 30 వేల రూపాయలు మరియు శ్రీ సాయి ఫిల్లింగ్ స్టేషన్ లో 70 వేల రూపాయలు ఫోన్ పే ద్వారా తీసుకోగా నేడు మరో లక్ష రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు ఈ కార్యక్రమంలో అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ జగదీష్ చందర్, సి.ఐ వెంకట్ రావు, సి.ఐ రామ రావు, సిబ్బంది శ్రీదర్,నరేష్,సంపత్   సిబ్బంది పాల్గొన్నారు.. 

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034