ఎదురెదురుగా రెండు వాహనాలు ఢీ
జోగులాంబ గద్వాల 15 మార్చి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ధరూర్ ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొనడంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డాడు. ధరూర్ మండలంలోని గూడెందొడ్డి గ్రామ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు శుక్రవారం ఢీకొట్టాయి.ఈ ప్రమాదంలో నెట్టెంపాడు గ్రామానికి చెందిన శేఖర్ కుడి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తికి గాయాలయ్యాయి. వీరిని స్థానికులు 108 వాహనంలో గద్వాల ఆస్పత్రికి తరలించారు. శేఖర్ నెట్టెంపాడు నుంచి ధరూర్ వస్తుండగా, మరో వాహనదారుడు ధరూర్ నుంచి నెట్టెంపాడుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.