హాస్పిటల్ సూపరింటెండెంట్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న

సంకాపురం రాముడు

Jun 14, 2024 - 19:23
 0  3

జోగులాంబ గద్వాల 14 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- అయిజ:-ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా అయిజ మండల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో శుక్రవారం పులకుర్తి తిరుమల రెడ్డి జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించి అదికంగా 240 యూనిట్స్ రక్తం ను అందించినందుకు శుక్రవారం అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు గద్వాల్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ నవీన్ క్రాంతి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. పలువురు వారిని అభినందించారు. అదేవిదంగా ప్రశంశల జల్లు కురిపించారు.ఈ కార్యక్రమంలో పులికల్ సింగిల్ విండో డైరెక్టర్ హనుమన్న,తోతినోని దొడ్డి మాజీ సర్పంచ్ శివకుమార్, బైనపల్లె రామలింగ, చిన్న తాండ్రపాడు మల్లేష్,గోవర్ధన్ మదన్న,బజారీ మరియు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333