వికలాంగుల సంఘ నాయకులు ఫిబ్రవరి 10న చలో ఢిల్లీ కార్యక్రమం

జనవరి 20న కలెక్టర్ కార్యాలయల ఎదుట సామూహిక నిరాహార దీక్షలు

Dec 28, 2024 - 17:16
 0  20
వికలాంగుల సంఘ నాయకులు ఫిబ్రవరి 10న చలో ఢిల్లీ కార్యక్రమం
వికలాంగుల సంఘ నాయకులు ఫిబ్రవరి 10న చలో ఢిల్లీ కార్యక్రమం

భువనగిరి 28 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- కేంద్ర ప్రభుత్వం వికలాంగుల కనీస పెన్షన్ 300 నుండి 5000 లకు పెంచాలని, ప్రతి వికలాంగునికి అంత్యోదయ రేషన్ కార్డు,ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు ఇచ్చి 200 రోజులు పని దినాలు కల్పించాలని దేశవ్యప్త ఉద్యమం చేస్తున్నామని  ఫిబ్రవరి10న వేలాది మంది వికలాంగులతో ఛలో ఢిల్లీ-వికలాంగుల మహాధర్నా నిర్వహిస్తున్నామని ఎన్.పి.ఆర్.డి.జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి స్వరూపంగా ప్రకాష్ వనం ఉపేందర్ తెలిపారు.కేంద్ర ప్రభుత్వం వికలాంగుల కనీస పెన్షన్ 5000లకు పెంచాలని, అంత్యోదయ రేషన్ కార్డ్స్, ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డ్స్ ఇచ్చి 200 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం రోజు జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు స్వరూపంగా ప్రకాష్ అధ్యక్షతన జరిగినది.ఈ కార్యక్రమనికి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ హాజరై మాట్లాడుతూ..దేశంలో 2011నుండి  పెన్షన్లలో కేంద్ర ప్రభుత్వం వాటా కేవలం 300 రూపాయలు మాత్రమే చేల్లిస్తుంది. నిత్యావసర సరకుల ధరలు 300 రేట్లు పెరిగినవి. కానీ పెన్షన్స్ మాత్రం పెంచకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ధరల పెరుగుదల సూచికి పెన్షన్స్ అనుసంధానం చేయాలి.కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఇందిరా గాంధీ జాతీయ వికలాంగుల పెన్షన్ పతకాన్ని వికలాంగులందరికి వర్తింపచేయాలి.రాజస్థాన్ రాష్ట్రం మాదిరిగా పెన్షన్ పొందడం వికలాంగుల హక్కుగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేయాలి.2015 డిసెంబర్ 3న అర్బటంగా ప్రధాన మంత్రి ప్రారంభించిన సుగమ్య భరత్ అభియాన్ పథకం అమలు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు నిధుల కేటాయింపులో కేంద ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ఫలితంగా 2024 సంవత్సరo పూర్తివుతున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం.కేంద్ర ప్రభుత్వం అసమర్ధత వలన 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం, 2017మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్,2007 ఐక్య రాజ్యా సమితి హక్కుల ఒప్పంద పత్రం,నేషనల్ పాలసీ, నేషనల్ ట్రస్ట్ వంటి కీలక చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు.2016 ఆర్.పి.డి.చట్టానికి సవరణ చేయడానికి విడుదల చేసిన గెజిట్ను రద్దు చేయాలి.2016 ఆర్.పి.డి చీఫ్ కమిషనర్,నేషనల్ ట్రస్ట్ కు10 ఏండ్ల నుండి చైర్మన్స్ నియమించడం లేదు.కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్స్ అందని ద్రాక్షగా మారుతున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను గుర్తించి భర్తీ చేసేందుకు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయాలి.ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటికరణ వలన వికలాంగులు రిజర్వేషన్ సౌకర్యం కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది.వివాహంతో సంబంధం లేకుండా వికలాంగులకు అంత్యోదయ అన్న యోజన కార్డులు జారీ చేయాలి.అన్ని రకాల రైలులలో వికలాంగుల ప్రయాణ రాయితీ సౌకర్యాన్ని పునరుద్దరించాలి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులు రాయితీలను పొండెందుకు యుడిఐడి కార్డునే గుర్తింపుగా పరిగణించాలని డిమాండ్ చేశారు.ఎన్.పి.ఆర్.డి జిల్లా అధ్యక్షులు ఎస్ ప్రకాష్ మాట్లాడుతూ..బడ్జెట్లో వికలాంగుల సంక్షేమనికి 5శాతం నిధులు కేటాయించాలి. వికలాంగుల విద్యా అభివృద్ధి కోసం తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల మాదిరిగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విద్యా పాలసి చేయాలి.సకలాంగుల క్రీడాకారులతో సమానంగా వికలాంగుల క్రీడాకారులను ప్రోత్సహించాలి.పారా క్రీడాలను అభివృద్ధి చేయాలి.కేంద్ర ప్రభుత్వ శాఖలాన్ని వికలాంగుల సంక్షేమనికి 5శాతం నిధులు కేటాయించి, ఖర్చు చేయాలి.నామినేటెడ్ పదవుల్లో వికలాంగులకు రిజర్వేషన్స్ కల్పిస్తూ పార్లమెంట్లో చట్టం చేయాలి.2016 ఆర్.పి.డి చట్టంతో పాటు ఇతర వికలాంగుల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి.2016 ఆర్.పి.డి చట్టం చీఫ్ కమిషనర్, నేషనల్ ట్రస్ట్కు చైర్మన్ లను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లేపల్లి స్వామి కోశాధికారి కొత్త లలిత జిల్లా ఉపాధ్యక్షులు శ్యాంసుందర్ యాదగిరి నాయకులు శ్రీహరి జోకు స్వామి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333