వర్కింగ్ లో ఉన్న ప్రతి జర్నలిస్టుకు ఎలక్షన్ పాసులు ఇవ్వాలి
రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి
సూర్యాపేట జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చిన టీఎస్ జే ఏ నాయకులు
రాబోయే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో వార్తల కవరేజీ కోసం వర్కింగ్ లో ఉన్న ప్రతి జర్నలిస్టుకు ఎలక్షన్ పాసులు ఇవ్వాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరు యాదగిరి కోరారు.గురువారం అసోసియేషన్ నాయకులతో కలిసి సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు కు వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ చిన్న మీడియా పెద్ద మీడియా అని తేడా చూపకుండా ఎలక్షన్ వార్తలు కవర్ చేయడానికి వర్కింగ్ లో ఉన్న ప్రతి జర్నలిస్టులకు ఎలక్షన్ పాసులు ఇచ్చి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌసుద్దీన్,ప్రచార కార్యదర్శి గట్టి గుండ్ల రాము,సూర్యాపేట నియోజకవర్గం పట్టణ సభ్యులు మామిడి రవి,దేశ గాని వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు