లక్ష డప్పుల వేల గొంతుల కళానేతల ప్రచార యాత్ర

*లక్ష డప్పుల వేల గొంతుల కళానేతల ప్రచార యాత్ర*
అడ్డగూడూరు 31 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మండల అధ్యక్షుడు సూరారం రాజు,ఉపాధ్యక్షుడు ఇటుకల అంజయ్య,లక్ష డప్పుల వెయి గొంతుల మండల అధ్యక్షుడు డప్పు పరశురాములు ఆధ్వర్యంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణసభను నిర్వహించారు.ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణలో వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాదులో జరిగే లక్ష డప్పులు వేయి గొంతుల సాంస్కృతిక ప్రదర్శన సభను విజయవంతం చేయాలని కళానేతల ప్రచార యాత్ర 24వ రోజు గురువారం అడ్డగూడూరు మండల కేంద్రం చేరుకోవడం జరిగింది.ఈ సందర్భంగా అడ్డగూడూరు మండల కేంద్రంలో సంస్కృతిక సభను నిర్వహించడం జరిగింది.
ఈ సభలో ఎమ్మార్పీ అనుబంధ సంఘాల రాష్ట్ర జిల్లా మండల నాయకులతోపాటు వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు,మాదిగ కుల పెద్దలు, విద్యార్థులు,అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామ్యవాదులు పాల్గొనడం జరిగింది.సామాజిక ఉద్యమ వందనంతో కందుకూరిసోమన్న మాదిగ ఎంఎస్ పి ఉమ్మడి నల్గొండ జిల్లా కో-కోఆర్డినేటర్ ఇందులో తదితరులు పాల్గొన్నారు.