రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ కానిస్టేబుల్  మరణం  పట్ల  సంతాపం వ్యక్తం చేసిన

జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు

Sep 18, 2024 - 19:28
 0  27
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ కానిస్టేబుల్  మరణం  పట్ల  సంతాపం వ్యక్తం చేసిన

జోగులాంబ గద్వాల్ 18 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- జిల్లా పరిదిలోని కేటీ దొడ్డి పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తిస్తున్న మహిళ కానిస్టేబుల్ కుమారి శ్రావణి (wpc-230) బుధవారం నాగార్జున సాగర్ దగ్గర రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడం పట్ల జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ లో ఎంతో బాధ్యత తో రిసెప్షన్ విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్న మహిళ కానిస్టేబుల్ అనుకోనివిధంగా రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడం ఎంతో బాధ కలిగించిందని, జిల్లా పోలీసు వ్యవస్థకు మహిళ కానిస్టేబుల్  శ్రావణి  లేని లోటు తీరనిదని, బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని జిల్లా ఎస్పీ తెలియజేశారు. బాధిత కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటూ పోలీసు వ్యవస్థ తరుపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333