రైతుల సంతోషమే కాంగ్రెస్ విజయం

Jul 18, 2024 - 21:31
 0  87
రైతుల సంతోషమే కాంగ్రెస్ విజయం

లక్ష రూపాయల రుణమాఫీ పై హర్షం వ్యక్తం చేస్తూ

 పెన్ పహాడ్ లో భారీ బైక్ ర్యాలీ,

కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు తూముల సురేష్ రావు ఆధ్వర్యంలో పెన్ పహాడ్

 తెలంగాణ వార్త , 18 జూలై పెన్ పహాడ్ మండల కేంద్రంలో ఈరోజు ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతు రుణమాఫీ పై ఇచ్చిన హామీ మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష రూపాయల రైతులకు రుణమాఫీ అమలు అవుతున్న సందర్భంగా గురువారం రోజు పెన్ పహాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూముల సురేష్ రావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీఏర్పాటు చేయడం జరిగినది, ఇట్టి కార్యక్రమానికి మండల స్థాయి కాంగ్రెస్ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు కార్యకర్తలను రైతులు ర్యాలీలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.మండల కేంద్రమైన పెన్ పహాడ్ రైతు వేదిక వద్ద లక్ష రూపాయల రుణమాఫీ పై సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు తూముల సురేష్ రావు మాట్లాడుతూ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ లక్ష రూపాయల రైతు రుణమాఫీ హామీ మేరకు రేవంతన్న ప్రభుత్వం లక్ష రూపాయలు రుణమాఫీ అమలవుతుందని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కాంగ్రెస్ పార్టీ ధేయం అని వారి సందర్భంగా తెలిపారు.పెన్ పహాడ్ రైతు వేదిక వద్ద ముఖ్యమంత్రి సందేశం లైవ్ టెలికాస్ట్ రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం, బాణాసంచా కాల్చి ఘనంగా సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు రాష్ట్ర పీసీసీ కార్యదర్శి తూముల భుజంగరావు,వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ ఆర్తి కేశవులు, జిల్లా ఉపాధ్యక్షులు మామిడి వెంకన్న, మాజీ జెడ్పిటిసి పిన్నిని కోటేశ్వరరావు, ఒగ్గు వెంకన్న, ఇటికాల శ్రీను, రామినేని నవీన్, శ్యాంసుందర్, చెనగని రాంబాబు, మైనార్టీ నాయకులు ఎస్ కే సయ్యద్ ( సైదులు), కత్తి రవీందర్,నకిరే కంటి వెంకన్న, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మామిడి సైదులుమండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ శాఖ అధ్యక్ష కార్యవర్గము యువజన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ అభిమానులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Harikrishna Penpahad Mandal Reporter Suryapet Dist Telangana State