రిటైర్డ్ ఏ.ఎస్.ఐ సిగిలంబట్ల సత్యనారాయణ పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన
మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు , తిప్పన విజయసింహ రెడ్డి

తెలంగాణవార్త ఫిబ్రవరి 10 మిర్యాలగూడ: మిర్యాలగూడ టౌన్ అశోక్ నగర్ కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ సిగిలంబట్ల హరీష్ తండ్రి అయిన రిటైర్డ్ ఏ.ఎస్.ఐ సిగిలంబట్ల సత్యనారాయణ గత కొంతకలముగా అనారోగ్యంతో బాదపడుతూ మొన్న రాత్రి స్వర్గస్తులయినారు.. వారి కుటుంబ సభ్యులు ఆస్ట్రేలియా దేశం నుంచి రావటానికి రెండు రోజులు పడుతుండడంతో, పార్ధివదేహాన్ని నల్లగొండ ఆసుపత్రి ఫ్రీజర్ లో భద్రపరచడం జరిగింది. కాగా ఈ రోజు ఉదయం వారి పార్ధివదేహాన్ని మిర్యాలగూడ లో వారి స్వగృహమునకు కుటుంబసభ్యులు తీసుకొచ్చారువిషయం తెలుసకున్న మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మారో మాజీ మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి తో కలిసి వారి ఇంటికి వెళ్ళి పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులు పూలమాల వేసి నివాళులు అర్పించి సత్యనారాయణ మృతి పట్ల ప్రగడా సంతపాన్ని తెలియజేశారు వారి వెంట అంగోతు హాతీరాం నాయక్,చౌగాని బిక్షం గౌడ్, ఎండి. షోయబ్, ఎలగుబెల్లి కృష్ణమూర్తి, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సీనియర్ రిపోర్టర్లు నాజీమ్, రామకృష్ణ, బాలాజీ రావు, మనోజ్, ఇండ్ల గణేష్, వెంకట్ హరీష్ కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు..