మున్సిపల్ నిధులతో డ్రైనేజీని పునరుద్దించండి.

Sep 21, 2024 - 18:58
Sep 21, 2024 - 19:29
 0  82
మున్సిపల్ నిధులతో డ్రైనేజీని పునరుద్దించండి.

మున్సిపల్ నిధులతో డ్రైనేజీని పునరుద్ధరించండి 

కోదాడ : 

ఇటీవల కురిసిన వర్షాలు, వరదల కారణంగా హుజూర్నగర్ రోడ్డులో డ్రైనేజీల నుండి నీరు పొంగి రహదారులపైకి రావడంతో మున్సిపల్ అధికారులు డ్రైనేజీల నుండి స్టిల్ట్ తీయడం జరిగింది ఈ క్రమంలో డ్రైనేజీలను పగలగొట్టడం జరిగింది ప్రస్తుతం డ్రైనేజీలను పగలకొట్టడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హుజూర్నగర్ రోడ్డులో గల షాపుల యజమానులు డ్రైనేజీలను తిరిగి మున్సిపల్ నిధులతో పునరుద్ధరించాలని వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు తో కలిసి మున్సిపల్ కమిషనర్ రమాదేవి కి శనివారం వినతి పత్రం అందజేశారు. అధికారులువినతి పత్రం అందజేసిన వారిలో మున్సిపల్ కౌన్సిలర్ తీపిరి శెట్టి సుశీల రాజు, ముడియాల భరత్ రెడ్డి, డాక్టర్ సుబ్బారావు, త్రివేది, మెళ్ళ చెర్వు కోటేశ్వర రావు తదితరులు ఉన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State