మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి మృతదేహానికి పూలమాలయేసి నివాళులర్పించిన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి

Apr 21, 2024 - 20:43
 0  10
మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి మృతదేహానికి పూలమాలయేసి నివాళులర్పించిన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ప్రతినిధి.మాజీ సర్పంచ్ సంజీవ రెడ్డి మృతి పలువురి పరామర్శ.. ఆత్మకూర్ ఎస్.. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ పన్నాల సంజీవరెడ్డి 60. అనారోగ్యంతో ఆదివారం తెల్లవారుజామున తన స్వగ్రామమైన మండల పరిధిలోని పాత సూర్యాపేట గ్రామంలో మృతి చెందారు. 40 ఏళ్లుగా గ్రామ మండల, జిల్లా స్థాయిలో పార్టీ పనులు చేపట్టి సేవలందించారు. సుమారు 15 ఏళ్లుగా కమ్యూనిస్టు పార్టీ లో పనిచేసిన సంజీవరెడ్డి టిడిపిలో మండల స్థాయి నేతగా పనిచేశారు. మాజీమంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కి సన్నిహితులు కావడంతో జగదీశ్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరారు.2013 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాతసూర్యాపేట సర్పంచ్ గా టిడిపి నుండి విజయం సాధించారు అటు తర్వాత బిఆర్ఎస్ లో చేరి 2019 లో తమ సతీమణి పన్నాల అలివేలు ను సర్పంచ్ గా గెలిపించుకున్నారు. ఆయన గత కొంతకాలంగా మధుమేహ వ్యాధితో బాధపడుతూ ఆదివారం మృతి చెందారు. సంజీవరెడ్డికి భార్య ఒక కుమారుడు ఉన్నారు. *పలువురి పరామర్శ.* మాజీ సర్పంచ్ పన్నాల సంజీవరెడ్డి మృతదేహానికి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి నివాళులర్పించారు. జడ్పీ వైస్ చైర్మన్ వెంకట నారాయణ గౌడ్, నూతనకల్ జెడ్పిటిసి కందాల దామోదర్ రెడ్డి,మర్ల చంద్రారెడ్డి, ముద్ధం కృష్ణారెడ్డి పుట్ట కిషోర్ సంజీవరెడ్డి, బయ్య మల్లికార్జున్, సుందరయ్య, అహల్య, దామోదర్ రెడ్డి, రామచంద్రయ్య, లచ్చయ్య, తదితరులు సంజీవరెడ్డి మృత దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.