మల్దకల్ దేవాలయం సందర్శించుకున్న ఐఏఎస్ గిరిజా శంకర్

Sep 5, 2024 - 19:37
 0  10
మల్దకల్ దేవాలయం సందర్శించుకున్న ఐఏఎస్ గిరిజా శంకర్
మల్దకల్ దేవాలయం సందర్శించుకున్న ఐఏఎస్ గిరిజా శంకర్

జోగులాంబ గద్వాల 5 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల కొంగుబంగారమై నిలిచిన ఆదిశిలావాసుడు మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్గా పనిచేసి ప్రస్తుతం విజయవాడ జిల్లా కలెక్టర్గా పని చేస్తున్న గిరిజా శంకర్ సతీసమేతంగా గురువారం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి తిమ్మప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికి దేవాలయంలో అర్చనలు నిర్వహించారు. అనంతరం స్వామివారి శేష వస్త్రం చిత్రపటం కలెక్టర్ కి బహుకరించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333