భూభారతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మందుల సామేల్

అడ్డగూడూరు 04 జూన్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని ధర్మారం గ్రామంలో గ్రామపంచాయతి కార్యాలయం వద్ద జరిగిన ప్రభుత్వం రెవెన్యూ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమం గ్రామ సభకు ముఖ్య అతిధులుగా విచ్చేసిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు మాట్లాడుతూ..ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శేషగిరిరావు,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు నిమ్మనగోటి జోజి, పిఎసిఎస్ చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి, వైస్ చైర్మన్ చెడే చంద్రయ్య,మోత్కూర్ మార్కెట్ వైస్ చైర్మన్ లింగాల నర్సిరెడ్డి, మోత్కూర్ డైరెక్టర్ బాలేoలా విద్యాసాగర్,మండల అధికారులు,పార్టీ నాయకులు గ్రామస్తులు,కార్యకర్తలు, ఇతరులు పాల్గొన్నారు.