భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ 

Sep 4, 2024 - 17:27
 0  1
భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ 

సెల్ఫీల కోసం వాగులు,వంకలు,నదులు వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురి కావొద్దు.

వరద నీటితో నిండిపోయిన రోడ్లను దాటడానికి ప్రయత్నించవద్దు.

వర్షాల కారణంగా రోడ్లు బురదమయంగా మారాయి.వాహనాల టైర్లు జారి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నది.కావున వాహనదారులు నెమ్మదిగా తమ వాహనాలతో ప్రయాణించాలి.

భద్రాచలం వద్ద గోదావరి నది  పెరుగుతున్నది కావున పరిసర ప్రాంత ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి.

జిల్లా అధికార యంత్రాంగం సూచించిన సూచనలు మేరకు ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారులకు సహకరించాలి.

ఏదైనా ప్రమాదం ఎదురైతే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసు వారి సహాయ సహకారాలు వినియోగించుకోవాలి.జిల్లా పోలీస్ శాఖ 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటుంది.

ప్రజల రక్షణ కొరకు తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసు వారు విధించిన ఆంక్షలును ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333