ప్రమాదం నుండి గట్టెక్కిన జింక, వైద్య సేవలను అందించిన పశు సమర్థక శాఖ అధికారులు.

జోగులాంబ గద్వాల, 14నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి: ఐజ.ప్రమాదానికి గురి అయిన జింకకు గద్వాల ప్రాంతీయ పశు వైద్యశాలలో చికిత్స నిర్వహించినట్లు పశు వైద్యాధికారి ఎస్.పి రంజిత్ కుమార్ తెలిపారు. ఐజ మండలం వద్ద ఒక జింక ప్రమాదానికి గురైందని వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు వైద్యం కొరకు దానిని ప్రాంతీయ వైద్యశాల గద్వాలకు సీరియస్ కండిషన్ లో జింకను తీసుకువచ్చారని, జింక పరిస్థితి విషమంగా ఉందని గ్రహించిన డాక్టర్ రంజిత్ దానికి మెరుగైన వైద్యం చేశానని అది కోలుకున్న తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు అప్పజెప్పినట్లు రంజిత్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ తేజస్విని తో పాటు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.