ప్రతి నీటి బొట్టు ను రక్షించుకుందాం ఎంపీ ఓ మారయ్య
తిరుమలగిరి 23 మార్చి 2024 తెలంగాణ వార్త రిపోర్టర్ :- తిరుమలగిరి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయడం జరిగినది. ప్రతి నీటి చుక్కను ఓడిసిపట్టి భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరి పై ఉందని వివరించడం జరిగినది. ఈ సందర్భంగా ఎంపీవో మారయ్య మాట్లాడుతూ నీరు ఉంటేనే జీవకోటి మనగడం సాధ్యం ప్రతి నీటి బొట్టును పరిరక్షించుకుందాం. భావితరాల భవిష్యత్తుకు భరోసాను కల్పిద్దాం ఇట్టి కార్యక్రమంలో , కార్యాలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది.