ప్రజావాణి ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి కలెక్టర్.

Aug 20, 2024 - 07:14
Aug 20, 2024 - 07:16
 0  4
ప్రజావాణి ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి కలెక్టర్.

జోగులాంబ గద్వాల 19 ఆగస్టు 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి.


గద్వాల. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్  అధికారులకు ఆదేశించారు. సోమవారం ఐ డి ఓ సి సమావేశం హాలు నందు  ఏర్పాటు చేసిన ప్రజావాణి  కార్యక్రమంలో  వివిధ సమస్యలపై వచ్చిన ప్రజా ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి సాధ్యమైనంత త్వరగా  తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో వారికి తగిన సూచనలు ఇవ్వాల్సిందిగా అధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం మొత్తం  18 ఫిర్యాదులు అందాయని, వచ్చిన దరకాస్తులను పెండింగ్ ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.  
      ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస రావు ,ఆర్ డి ఓ  రామ్ చందర్ , వివిధ శాఖ  జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333