ఘనంగా శ్రీ తిమ్మప్ప స్వామి కళ్యాణం.

Aug 20, 2024 - 07:12
Aug 20, 2024 - 07:18
 0  6

జోగులాంబ గద్వాల 19 ఆగస్టు 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి.


మల్దకల్. ఆదిశిలా క్షేత్రం శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో శ్రావణ పౌర్ణమి (రాఖీ పౌర్ణమి) సందర్భంగా శ్రీ పద్మావతి అలివేలు సమేత శ్రీనివాసుని కళ్యాణం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇదే రోజు అనగా 2012 శ్రావణ పౌర్ణమి రోజున మల్దకల్ గ్రామానికి చెందిన భక్తుడు దామ శంకరయ్య దంపతులు దాదాపు 5 లక్షల తో తయారు చేయించిన టేకు రథోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. నాటి నుండి నేటి వరకు భక్తులకు రథోత్సవాన్ని నిర్వహించేందుకు వీలుగా శంకరయ్య దంపతులు చేయించిన రథం ద్వారా దేవాలయానికి కూడా కొంత ఆదాయం వస్తున్నది. దామ శంకరయ్య దంపతులకు వారి కుటుంబానికి శ్రీ తిమ్మప్ప స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని దేవాలయ చైర్మన్ శ్రీకృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాద రావు,, ఈవో సత్య చంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కళ్యాణం చేయించిన భక్తులు దామ పార్వతమ్మ శంకరయ్య, గార్లపాడు వసుమతి దేవి చక్రధర్ చారి గార్లకు స్వామివారి శేష వస్త్రం చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో పట్వారి అరవిందరావు, ఆలయ అర్చకులు మధుసూదనాచారి, దీరేంద్ర దాస్, రమేష్, రవి, నాగరాజు శర్మ తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State