నిరుద్యోగులు స్వయంకృషితో ఎదగాలి

జిల్లా కాంగ్రెస్ నాయకులు చిలుముల సునీల్ రెడ్డి
సూర్యాపేట 12 ఆగస్టు 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- సూర్యాపేట: నిరుద్యోగులు స్వయంకృషితో ఎదగాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు చిలుముల సునీల్ రెడ్డి అన్నారు.జిల్లా కేంద్రంలోని కుడ కుడ రోడ్ లో నూతనంగా నిర్వాహకులు కుర్ర నరేష్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ఎదురు చూడకుండా స్వయంకృషితో ఎదగాలని ఆకాంక్షించారు. వ్యాపారంలో రాణించాలంటే వినియోగదారుల మన్ననలను పొందాలని వ్యాపారంలో వినియోగదారుల నుంచి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి, నాగరాజు, సందీప్, శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు