డ్రైనేజీని ఆక్రమించిన దుకాణదారులు.

May 27, 2024 - 17:02
May 27, 2024 - 17:35
 0  36
డ్రైనేజీని ఆక్రమించిన దుకాణదారులు.
డ్రైనేజీని ఆక్రమించిన దుకాణదారులు.

రోడ్డుపై పారుతున్న మురుగునీరు.

.. తొమ్మిదో వార్డు రాయచూరు ప్రధాన రహదారి.

జోగులాంబ గద్వాల 27 మే 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల.  కేంద్రంలోని తొమ్మిదవ వార్డు రాఘవేంద్ర కాలనీ రాయచూరు కు వెళ్లే మెయిన్ రోడ్డు లో దుకాణదారులు డ్రైనేజీ పై దుకాణం నిర్మించడంతో మురుగునీరు నిలిచిపోయి రోడ్డుపై పారుతున్నదని కాలనీవాసులు ఆరోపించారు. గత కొన్ని సంవత్సరాల నుండి ఈ తతంగం నడుస్తున్న మున్సిపల్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై మొరుగునీరుపారడంతో పాదచారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. కావున సంబంధిత మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టి మురుగునీరు వెళ్లేలా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333