డ్రగ్స్,సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 

 ఎస్సై ఎం.ఐలయ్య 

Oct 3, 2024 - 20:51
 0  50
డ్రగ్స్,సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 
డ్రగ్స్,సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 

 నాగారం అక్టోబర్ 3 తెలంగాణ వార్త:  డ్రగ్స్, సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్సై ఎం.ఐలయ్య అన్నారు. ఈ సందర్భంగా గురువారం మండల కేంద్రంలో పోలీస్ జాగృతి కళాకారులు నిర్వహిస్తున్న సాంస్కృతిక కళా ప్రదర్శనలో వారు పాల్గొని మాట్లాడుతూ జిల్లాఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు సైబర్ నేరాలపైన, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులపై, రోడ్డు ప్రమాదాలపై పోలీస్ జాగృతి కళాబృందం ప్రదర్శించిన ప్రదర్శన నేటి డ్రగ్స్, సైబర్ నేరాలను కండ్లకు కట్టినట్టుగా ప్రజలకు తెలియజేయడం అభినందనీయమని కొనియాడారు.రోడ్డు ప్రమాదాలపై , సైబర్ నేరాలపై, గంజాయి డ్రగ్స్ మత్తు మందులు, గుట్కాపై  పటిష్టంగా పోలీసు యంత్రాంగం పటిష్టంగా పనిచేస్తుందని తెలిపారు. ప్రతి గ్రామంలో, స్కూల్లో, కళాశాలలో చదువుకునే విద్యార్థులు,యువతి యువకులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ప్రజలు సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దని, బ్యాంక్ ఖాతా,ATM కార్డ్ వివరాలు, OTP వివరాలు ఇతరులకు తెలపవద్దని అన్నారు. అపరిచితులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దని తెలిపారు. మెసేజ్ లలో వచ్చే బ్లూలింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దని తెలిపారు. ఎవరైనా సైబర్ ఉచ్చులో పడి మోసపోతే, లేదా ఎవరైనా మోసాలు చేస్తున్న 1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే రోడ్డు నియమ నిబంధనలు తెలుసుకోవాలని అతివేగం ప్రయాణించవద్దుని తమను నమ్ముకుని జీవిస్తున్న కుటుంబాలను వీధిపాలు చేయవద్దని కోరారు.వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దని తెలిపారు. వ్యక్తిగత ఫోటోలను  డి.పి.లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దని అన్నారు.గంజాయి మత్తుమందులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపవద్దు ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించొద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు  కళబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో ప్రజలకు అవగాహనకల్పించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ శ్రీనివాస్, హోంగార్డ్ లింగయ్య, వీరునాయక్,  కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపయ్య, క్రిష్ణ,చారి, నాగార్జున ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333