జమ్ములమ్మ మరియు పరుస రాముడు దేవస్థానం హుండీ లెక్కింపు
జోగులాంబ గద్వాల 3జూలై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ జమ్ములమ్మ మరియు పరశురామ స్వామి దేవస్థానం , గద్వాల్ టౌన్ ( జమ్మిచేడు) ,.…
"హుండీ లెక్కింపు".
తేది:03-07-2026 శుక్రవారం రోజున అనగా ఈ రోజు దేవాదాయ శాఖ గద్వాల డివిజన్ పరిశీలకులు వెంకటేశ్వరి , ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీ.ఆర్.పురేందర్ కుమార్ , మరియు యూనియన్ బ్యాంకు మేనేజర్ , సిబ్బంది గ్రామ పెద్దలు, గ్రామస్తులు, ఆలయ సిబ్బంది మరియు భక్తుల సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించగా ఇట్టి "హుండీ లెక్కింపు" కార్యక్రమం యందు 3 నెలలకు (100 రోజులు ) గాను మొత్తం హుండీ ఆదాయం రూ"20,29,500 /- అక్షరాల ఇరభై లక్షల ఇరభై తొమ్మిది వేల అయిదు వందల రూపాయలు ఆదాయం వచ్చినదని ఇట్టి హుండీ లెక్కింపు యందు వెండి, బంగారం ఏమియు రాలేదని తెలియజేసిన కార్యనిర్వహణ అధికారి పురేందర్ కుమార్.