బాల సదన్ చిన్నారులకు పోలీస్ శాఖ తరుపున సహయ సహకారాలు ఎల్లపుడూ ఉంటాయి
జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు
జోగులాంబ గద్వాల 19 ఆగస్ట్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి. గద్వాల:-రాఖి పౌర్ణమి సందర్భంగా ఈ రోజు బాల సదనం చిన్నారులు జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు కి రాఖి కట్టి, చిన్నారులు తాము స్వయంగ తయ్యారు చేసినా క్రాఫ్ట్ వర్క్ డిజైన్ లను అందజేసి ఎస్పీ ఆశీస్సులను అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ చిన్నారులు చూపించిన ప్రేమ మరియు ఆప్యాయత, ఏలాంటి కల్మషం లేని వారి చిరునవ్వులు తమకు ఎంతో ఆనందం కలిగిస్తాయని, వారితో కలిసి ఈ పండుగను జరుపుకోవడం తమకు సంతోషంగా ఉందని అన్నారు.జిల్లా లో ఆదరణ పొందనీ చిన్నారులను ప్రతి సంవత్సరం స్మైల్, మష్కాన్ ఆపరేషన్స్ చెప్పట్టి గుర్తించి చేరదియ్యడం జరుగుతుందని, బాల సదనం లో చదువుతున్న చిన్నారులకు పోలీస్ శాఖ తరుపున సహయ సహకారాలు ఎల్లపుడూ ఉంటాయని, చిన్నారులు కూడా శ్రద్ధ తో బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
అనంతరం చిన్నారులకు స్వీట్స్ పంపిణీ చేసి చిన్నారుల విద్య వివరాలు, వారి ఆక్టివ్ స్వభావాలు, సెమీ ఆర్ఫన్ చిన్నారుల కుటుంబాల పరిస్థితులను బాల సదనం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ సుజాత, డీసీపీఓ నరసింహ, సూపరిండెంట్ సుధారాణి, బాల సదనం సిబ్బంది, పిల్లలు పాల్గొన్నారు.