క్రాంతిరెడ్డి ఘన నివాళులు బీజేపీ నేతలు

May 26, 2024 - 19:18
May 26, 2024 - 19:25
 0  3
క్రాంతిరెడ్డి ఘన నివాళులు బీజేపీ నేతలు

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ క్రాంతిరెడ్డి ఘన నివాళులు బీజేపీ నేతలు ఆత్మకూరు ఎస్... ఇటీవల రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన భారతీయ జనతా పార్టీ నల్లగొండ పార్లమెంటు సోషల్ మీడియా కో కన్వీనర్ కీర్తిశేషులు కొప్పుల క్రాంతి రెడ్డి సంతాప సభ మండల పరిధిలోని నెమ్మికల్ లోని వందన గార్డెన్ లో నిర్వహించారు .ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి మరియు నల్లగొండ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి హాజరై క్రాంతిరెడ్డి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. నిస్వార్థ కార్యకర్తలుపార్టీ కి మూల స్తంబాలని వారన్నారు ఈ సంతాప సభలో నివాళులర్పించిన వారిలో జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, రాష్ట్ర నాయకులు మాధగోని శ్రీనివాస్ గౌడ్, చల్లా శ్రీలత రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ కర్నాటి కిషన్, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, మండల అధ్యక్షులు పందిరి రాంరెడ్డి, జిల్లా మండలాల నాయకులు ఉన్నారు.