కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి కళ్యాణ లక్ష్మి చెక్కులు అందిస్తూ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

Jul 22, 2024 - 20:06
 0  35
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి కళ్యాణ లక్ష్మి చెక్కులు అందిస్తూ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

 తెలంగాణ వార్త

 పెన్ పహాడ్, మండలం జూలై 22 కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంతకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు, సోమవారం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని 61 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేస్తున్నామని డబ్బా కొట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీ అమలు చేయడం లేదని అన్నారు మొన్న చేసిన రుణమాఫీ పై వివరాలు అడిగితే అధికారులు గందరగోళానికి గురవుతున్నారని అన్నారు రుణమాఫీ పై మాసిపూసి మారేడు కాయ చేసి ప్రజలను మోసం చేస్తురని ఆరోపించారు అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మి 61 షాదీ ముబారక్ 02 చెక్కులను పంపిణీ చేశారు, కొత్తగా పెళ్లయిన వారు తులం బంగారం వస్తుందని ఆశపడ్డారని వారి ఆశలు అడియాశలు అయినయ్ అన్నారు, తీరా చూస్తే గత ప్రభుత్వ హాయంలో జారీ అయిన చెక్కులని ఇచ్చారన్నారు, ఇప్పటికైనా అబద్దపు హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేయొద్దని అన్నారు, ఈ కార్యక్రమంలో తహసిల్దార్ మందడి మహేందర్ రెడ్డి ఎంపీడీవో జే వెంకటేశ్వరరావు, ఆర్ఐలు మట్టయ్య ,స్వప్న ,పిఎసిఎస్ చైర్మన్లు నాతాల జానకిరామ్ రెడ్డి ,వెన్న సీతారామరెడ్డి ,మాజీ ఎంపీపీ నెమ్మది బిక్షం, బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు దొంగరి యుగంధర్ మాజీ ఎంపీటీసీ జూలకంటి వెంకటరెడ్డి , నాయకులు వెంకట్ నారాయణ గౌడ్ ,మామిడి అంజయ్య, మారిపెద్ది శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Harikrishna Penpahad Mandal Reporter Suryapet Dist Telangana State