కనకదుర్గా దేవి ఆశీస్సులు 22 వ వార్డు ప్రజలందరి పై ఉండాలి.

Oct 8, 2024 - 17:10
Oct 8, 2024 - 17:46
 0  86
కనకదుర్గా దేవి ఆశీస్సులు 22 వ వార్డు ప్రజలందరి పై  ఉండాలి.

కనక దుర్గాదేవి ఆశీస్సులు 22వ వార్డు ప్రజలందరిపై ఉండాలి

22వ వార్డులో కనకదుర్గాదేవి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా BRS నాయకులు మోత్కూరి సందీప్

శ్రీ శ్రీ కనక దుర్గాదేవి ఆశీస్సులు 22వ వార్డు ప్రజలందరిపై ఉండి సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని పట్టణ బిఆర్ఎస్ నాయకులు మోత్కూరి సందీప్ అన్నారు*. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 22వ వార్డులో ఏర్పాటు చేసిన కనకదుర్గ దేవి విగ్రహం వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. *తన చిన్ననాటి నుంచి ఈ వీధిలో కనకదుర్గ దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.* దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి సభ్యులు తాండు వెంకటేష్, తండు సాయి, ఈశ్వర్, అనిల్, సాయి, భరత్, గోపి, దుర్గారావు, దుర్గమ్మ, అరుణ, ఎల్లమ్మ, సులోచన తదితరులు ఉన్నారు

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223