మహాలక్ష్మి పథక ని లబ్ధిదారులకు అందించిన జూపల్లి అనుచరులు

Oct 12, 2024 - 22:12
 0  63
మహాలక్ష్మి పథక ని లబ్ధిదారులకు అందించిన జూపల్లి అనుచరులు

12-10-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.

 చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం గ్రామంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలలో ఒకటైన 500 రూపాయలకే యల్. పి. జి సిలిండర్ ను అందించాలని లక్ష్యంతో మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తుంది.

 గూడెం గ్రామంలో మంత్రి జూపల్లి గారి అనుచరులు గూడెం గ్రామానికి చెందిన 236 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది.

 తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసిన మహిళలకు గూడెం గ్రామ జూపల్లి ని నమ్మిన బంటులు, జూపల్లి అనుచరులు, జూపల్లి సన్నిహితులు, జూపల్లి కార్యకర్తలు, అందరూ కలిసి గూడెం గ్రామపంచాయతీ దగ్గర పత్రాలను అందజేశారు.

 ఈ యొక్క కార్యక్రమంలో క్యాథూరి రాముడు, కుమ్మరి బుచ్చన్న, అవ్వల్ల వెంకటస్వామి, వెంకటేశ్వరరావు, బత్తుల నారాయణ, వెలుమ రాజు, పెద్ద నరసింహ, క్యాతూరి అయ్యన్న, పెద్ద గలైన్న, అంబయ్యల కురుమయ్య తదితరులు పాల్గొని తెలంగాణ ప్రభుత్వ అభయహస్త కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State