ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ నియామక పత్రాలను అందజేసిన జిల్లా కలెక్టర్
జోగులాంబ గద్వాల 16 అక్టోబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల జిల్లాలో డి.ఎస్.సి-2024 ద్వారా కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ అనంతరం నియామక పత్రాలను జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్ అందజేశారు.బుధవారం కలెక్టర్ ఛాంబర్ నందు డి.ఎస్.సి-2024లో కొత్తగా నియమితులైన స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలకు నియామక పత్రాలు కలెక్టర్ చేతులమీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నియమితులైన ఉపాధ్యాయులు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగారావు, జెడ్పి సిఈఓ కాంతమ్మ ,విద్యా శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.