ఇప్పటికే మహిళలకు క్షమాపణలు చెప్పాను: మాజీ మంత్రి కేటీఆర్

Aug 24, 2024 - 17:27
Aug 24, 2024 - 17:28
 0  3
ఇప్పటికే మహిళలకు క్షమాపణలు చెప్పాను: మాజీ మంత్రి కేటీఆర్

హైదరాబాద్:ఆగస్టు 24

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా తెలంగాణ మహిళా కమిషన్ నోటీసు లు జారీ చేసిన విషయం తెలిసిందే. 

నేడు మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరైన కేటీఆర్.. కమిషన్ ఎదుట జరిగిన పరిణామా లను మీడియాకు వివరిం చారు. తాను వ్యక్తిగతంగా కమిషన్ ఎదుట హాజరై.. 

యధాలాపంగా చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే అందుకు తాను విచారం వ్యక్తం చేస్తున్నాను అని అంగీకరిం చినట్టు తెలిపారు. ఇప్పటికే ఆ విషయంపై మహిళలకు క్షమాపణ చెప్పినట్లు గుర్తుచేశారు. 

అయితే, చట్టాన్ని గౌరవించి మహిళా కమిషన్ ఎదుట హాజరవడానికి తాను వస్తే... కాంగ్రెస్ మహిళా నేతలు జనాన్ని వెంటేసు కుని వచ్చి తన వెంట వచ్చి న మహిళా ప్రజాప్రతినిధుల  పై దాడి చేయడం బాధాక రం అన్నారు. 

తాను మహిళా కమిషన్ ఎదుట విచారణలో ఉండగా.. భవనం బయట ఉన్న బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులపై కాంగ్రెస్ మహిళా నేతలు దాడి చేశారని ఆరోపించారు. 
నెయిల్ కట్టర్స్‌తో దాడికి పాల్పడినట్లుగా బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు తన వద్ద వాపోయారని అన్నారు. పోలీసుల అండ దండలు చూసుకుని కాంగ్రె స్ నేతలు ఈ దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333