ఇంటర్‌ ప్రవేశాల గడువు అక్టోబర్‌ 15 వరకు పొడిగింపు శృతి ఓజా

Sep 29, 2024 - 18:49
 0  1
ఇంటర్‌ ప్రవేశాల గడువు అక్టోబర్‌ 15 వరకు పొడిగింపు  శృతి ఓజా

హైదరాబాద్:సెప్టెంబర్ 29: తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లకు సంబంధించిన కీలక అప్డేట్ ఇచ్చింది,తెలంగాణ ఇంటర్ బోర్డు.

జూనియర్ కళాశాలలో ప్రవేశాల గడువును వచ్చేనెల 15వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది.ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శృతి ఓజా శనివారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. 

రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రయివేటు, మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలను పొందాలని విద్యార్థులకు సూచించారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం లో ప్రయివేటు జూనియర్‌ కాలేజీల్లో చేరేందుకు ఆలస్య రుసుం రూ.500 చెల్లించాలని తెలిపారు. 

ప్రభుత్వరంగ జూనియర్‌ కాలేజీలకు ఆలస్య రుసుం నుంచి మినహాయింపు ఉందని పేర్కొన్నారు. అనుబంధ గుర్తింపు ఉన్న జూనియర్‌ కాలేజీల్లోనే చేరాలని విద్యార్థులకు, చేర్పించాలని తల్లిదండ్రు లను కోరారు. 

ఆ కాలేజీల జాబితాను  వెబ్‌సైట్‌లో పొందుపర్చా మని వివరించారు. గుర్తింపు లేని కాలేజీల్లో చేరొద్దని సూచించారు. విద్యార్థులకు ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో వచ్చేనెల 15వ తేదీ వరకు ప్రవేశాలను కల్పించాలని జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లను ఆమె ఆదేశించారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333