సోసైటీ పేరుతో కాకుండా ఒక్కొక్కరికి  వ్యక్తిగతంగా ఇళ్ల స్థలాలు ఇస్తాం!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Jun 13, 2026 - 21:02
 0  2

కేబినెట్‌ సబ్‌ కమిటీ సిఫార్సు చేస్తే వెంటనే ఆమోదిస్తాం.

న్యూఢిల్లీ: :-
‘జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే కృతనిశ్చయంతో ఉన్నాం. అందులో భాగంగానే ఈ అంశంపై కేబినెట్‌ సబ్‌కమిటీ వేశాం. మీకు ఎలాంటి మసస్య ఉన్నా మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణరావు, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు కు చెప్పుకోండి. సబ్‌ కమిటీని ఒకే చోట కూర్చోబెట్టి ఆ సిఫార్సులను తీసుకువస్తే మీరు టీ తాగే లోపు మినిట్స్‌ రాసి, కేబినెట్‌లో ఆమోదిస్తాం. . వీటిపై ఎవరైనా పిటిషన్లు వేయాలన్నా సాధ్యం కాదు. ఎందుకంటే వ్యక్తిగతంగా ఇస్తాం కాబట్టి.. ఇళ్ల స్థలాలపై పిటిషన్‌ వేయాల్సి వస్తే ఒక్కొక్కరి పేరుమీద వేయాలి. అది సాధ్యం కాదు. భవిష్యత్తులో ఆ ఇళ్ల స్థలాలపై సమస్యలు రాకూడదన్నదే మా ప్రయత్నం’ అని  సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333